Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ గడ్డపై విజృంభిస్తున్న కోహ్లీ సేన.. రహానే సెంచరీ.. బౌలర్లు రాణిస్తే గెలుపే!

కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తన సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత జట్టు.. అదే స్థాయిలో బౌలర్లు రాణిస్తే గెలుపు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (15:36 IST)
కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు తన సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత జట్టు.. అదే స్థాయిలో బౌలర్లు రాణిస్తే గెలుపును నమోదు చేసుకున్నట్టే. 358/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 500/9 వద్ద డిక్లేర్‌ చేసింది.
 
కానీ విండీస్ బ్యాటింగ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. విండీస్ బ్యాటింగ్‌కు సాధ్యపడలేదు. ఇక భారత ఇన్నింగ్స్‌లో రహానే 237 బంతుల్లో 13 ఫోర్లు,  మూడు సిక్సర్లలో అజేయ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో 108 పరుగులు సాధించాడు. వృద్ధిమాన్‌ సాహా(47)తో కలిసి ఆరో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్‌ భారీ ఆధిక్యాన్ని సాధించగలిగింది. 
 
రెండో రోజు కేఎల్‌ రాహుల్‌(158) శతకం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్‌ బౌలర్లలో చేజ్‌ ఐదు వికెట్లు తీశాడు. ఇక రెండో రోజు 62 పరుగులు సాధించిన రహానే.. సోమవారం ఆటలో 108 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా రహానే టెస్టుల్లో ఏడో సెంచరీని నమోదు చేసుకున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments