Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో వరల్డ్ కప్ ట్వంటీ-20: పాక్‌తో ఆడేది లేనిది వారంలో తేలుతుంది: పీసీబీ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (10:08 IST)
భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచకప్ ట్వంటీ-20లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో ఆడనుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంకా భారత్‌తో పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆడుతుందా అనేది వారం రోజుల్లో తేలిపోతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ అంజాద్ హుస్సేన్ వెల్లడించారు. పాకిస్థాన్ సర్కారు భారత్‌లో ఆడేందుకు అనుమతిస్తే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియాతో పాక్ ఆడుతుందని హుస్సేన్ తెలిపారు. 
 
ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆడేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధంగా ఉందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటిస్తే దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత్‌లో పర్యటించే ఏ జట్టుకైనా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగల సామర్థ్యం బీసీసీఐకి ఉందన్న సంగతి విదితమే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments