Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు.. పీసీబీకి మెయిల్.. భద్రత కట్టుదిట్టం

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:05 IST)
టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు పొంచివుందని హెచ్చరికలు రావడంతో ఐసీసీ అప్రమత్తమైంది. టీమిండియాకు ఉగ్ర ముప్పు పొంచి వుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అనామక మెయిల్ నుంచి సమాచారం అందింది. 
 
విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుపై దాడులు జరపబోతున్నామని అందులో పేర్కొన్నారు. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. ఇటు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
బీసీసీఐ భారత హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో.. అంటిగ్వాలోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేశారు. దీంతో ఆటగాళ్లకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అంటిగ్వాలోని భారత హైకమిషన్ అధికారి తెలిపారు. 
 
అక్కడ భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్, దాని పరిసరాలపై పటిష్టమైన నిఘా ఉందన్నారు. కాగా, ఉగ్రదాడుల బెదిరింపు హెచ్చరికలతో వచ్చిన మెయిల్ బోగస్ అని అధికారులు తేల్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments