Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులు లేకుండానే ఐసీసీ ప్రపంచ కప్ పోటీ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:36 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు భారత్ వేదికగా జరుగున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, టోర్నీకి ముందు ఆయా జట్లు సన్నాహక మ్యాచ్‌లను ఆడునున్నాయి. ఇందులో భాగంగా, ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. 
 
అయితే, ఈ ప్రాక్టీసు మ్యాచ్‌పై పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో, ఆ దిశగా మరింత భద్రతను అందించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేట్టయితే అత్యధిక సంఖ్యలో పోలీసులతో భద్రత అందించాల్సి ఉంటుందని, గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో తాము పెద్ద సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించలేమని తేల్చి చెప్పారు. 
 
దీంతో పాక్-కివీస్ వార్మప్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరుపుకోవాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పెద్దలకు పోలీసులు వివరించారు. పోలీసుల సూచనలను హెచ్‌సీఏ పాటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 1,500 టికెట్లు విక్రయించినప్పటికీ, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపడానికే హెచ్‌సీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments