Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులు లేకుండానే ఐసీసీ ప్రపంచ కప్ పోటీ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:36 IST)
వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు భారత్ వేదికగా జరుగున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, టోర్నీకి ముందు ఆయా జట్లు సన్నాహక మ్యాచ్‌లను ఆడునున్నాయి. ఇందులో భాగంగా, ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. 
 
అయితే, ఈ ప్రాక్టీసు మ్యాచ్‌పై పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో, ఆ దిశగా మరింత భద్రతను అందించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేట్టయితే అత్యధిక సంఖ్యలో పోలీసులతో భద్రత అందించాల్సి ఉంటుందని, గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో తాము పెద్ద సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించలేమని తేల్చి చెప్పారు. 
 
దీంతో పాక్-కివీస్ వార్మప్ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే జరుపుకోవాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పెద్దలకు పోలీసులు వివరించారు. పోలీసుల సూచనలను హెచ్‌సీఏ పాటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 1,500 టికెట్లు విక్రయించినప్పటికీ, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపడానికే హెచ్‌సీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments