Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు - లబోదిబోమంటున్న హోటల్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:21 IST)
ఇటీవల క్రికెట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ దేశానికి వచ్చింది. కానీ, మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ సిరీస్‌ను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా కివీస్ బోర్డు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
అయితే, పాక్ గడ్డపై అడుగుపెట్టిన కివీస్ క్రికెటర్లకు భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెరికల్లాంటి కొదరు కమాండోలతో భద్రతను కల్పించింది. కివీస్ ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం 500 మంది కమాండోలను రంగంలోకి దించింది. 
 
అయితే, న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కేవలం భద్రతా సిబ్బంది బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు అయిందట. న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్లిపోవడంతో, పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పెండింగ్‌లో ఉంచింది. హోటల్ నిర్వాహకులు మాత్రం లబోదిబోమంటున్నారు. 
 
భద్రతా సిబ్బందికి రోజుకు రెండుసార్లు బిర్యానీ పెట్టామని వారు వెల్లడించారు. ఈ బిర్యానీ బిల్లు ప్రస్తుతం పాక్ ఆర్థికశాఖ వద్ద ఉందట. కమాండోలకు తోడు సరిహద్దు భద్రతాదళం పోలీసులను కూడా న్యూజిలాండ్ ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల కోసం పిలిపించారు. వారి భోజన బిల్లులు అదనం అని హోటల్ వర్గాలు తెలిపాయి.
 
మరి పాక్ క్రికెట్ బోర్డు దీనిపై ఏంచేస్తుందో చూడాలి. నష్ట పరిహారం రూపంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మొత్తం కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, 2009లో శ్రీలంక జట్టుపై పాక్‌లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి చాన్నాళ్లపాటు విదేశీ జట్లు పాక్‌లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వచ్చినా, వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆ పర్యటన రద్దు కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

తర్వాతి కథనం
Show comments