Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ రంగంలోనూ మార్పులు : సౌరవ్ గంగూలీ

Webdunia
ఆదివారం, 31 మే 2020 (12:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయనీ, అలాగే, క్రికెట్ రంగంలోనూ మార్పులు సంతరించుకుంటాయని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల మాదిరిగానే, ఇకపై క్రికెట్ కూడా మారిపోబోనుందని వ్యాఖ్యానించారు. 
 
కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని, ఆ తర్వాత మాత్రం సాధారణ స్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పటివరకు క్రికెట్ పోటీల నిర్వహణపై ఆచితూచి అడుగులు వేయాల్సివుంటుందన్నారు. 
 
ఈ మహమ్మారి కారణంగా క్రికెట్ షెడ్యూల్స్‌లో మార్పులుంటాయన్నారు. అదేసమయంలో ఐసీసీతో కలిసి క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకస్తామన్నారు. క్రికెట్ చాలా శక్తిమంతమైన ఆటని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని వ్యాఖ్యానించారు. 
 
భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు. 
 
తన చిన్న వయసులో ఫుట్‌బాల్ గేమే జీవితంగా గడిపానని, అనుకోకుండా క్రికెటర్‌గా మారానని చెప్పిన గంగూలీ, చిన్న వయసులో ఒడిశాపై చేసిన శతకం, లార్డ్స్ మైదానంలో చేసిన సెంచరీ, తనకు మధుర స్మృతులని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments