Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీఫైనల్స్‌‌లో టీమిండియా... ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాకిస్తానా..!

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (11:57 IST)
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను 109 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
 
ఓపెనర్ రోహిత్‌శర్మ విరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులతో సూపర్ సెంచరీ చేశాడు. సురేష్‌రైనా 65, చివర్లో జడేజా 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు.
 
అనంతరం 303 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 45 ఓవర్లలో 193 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత్ బౌలర్లలో ఉమేష్‌యాదవ్ 4 వికెట్లు తీశాడు. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
భారత్ సెమీస్‌లో శుక్రవారం జరిగే ఆసీస్-పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సిడ్నీలో ఈ నెల 26న జరిగే సెమీఫైనల్లో తలపడనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments