Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోంది : కివీస్ పోలీసుల ట్వీట్

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:01 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు ఆ దేశ పోలీసులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
 
ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటనను ముగించుకున్న కోహ్లీ సేన ఇపుడు న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో భారత జట్టు వరుసగా విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే, వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
కివీస్ గడ్డపై భారత జట్టు విధ్వంసం సృష్టిస్తుండడంతో ఆ దేశ పోలీసులు సరదాగా ఓ ట్వీట్ చేశారు. కివీస్ జట్టును హెచ్చరిస్తూనే.. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత జట్టు విధ్వంసం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూజిలాండ్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
తొలి వన్డేలో 8 వికెట్లతో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో 90 పరుగులతో కివీస్‌ను మట్టికరిపింది. కోహ్లీ అండ్‌ కో ప్రదర్శనకు ఫిదా అయిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసులు.. సోషల్‌ మీడియా వేదికగా భారత జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తూ ఇలా సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
 
'ప్రజలకు పోలీసుల హెచ్చరిక. విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోంది. గతవారం నేపియర్‌, ఆ తర్వాత మౌంట్‌ మాంగనూ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌లలో అమాయకంగా కనిపించే కివీస్‌ జట్టుపై కనికరం లేకుండా దాడులు చేయడమే అందుకు సాక్ష్యం. క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ వంటి వస్తువులను మీతో ఉంచుకున్నట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాల'ని ఆ పోస్టులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments