Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ వన్డే : భారత బౌలర్ల ధాటికి 157 పరుగలకే ఆలౌట్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (10:51 IST)
నేపియర్ వన్డేలో భారత బౌలర్లు జూలు విదిల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ దెబ్బకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. కీవీస్ జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ కీలకమైన మూడు వికెట్లు, చాహాల్ 2, జాదవ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు. ఫలితంగా కివీస్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును ఆరంభంలోనే షమీ దెబ్బతీశాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (64) ఒక్కడే అర్థశతకంతో రాణించగా, రాస్ టేలర్ (24) పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గుప్తిల్ (5), మున్రో (8), టామ్ లాథమ్ (11), హెన్రీ నికోల్స్ (12) నిరాశపరిచారు. 
 
పైగా, సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌట్ అయింది. నిజానికి 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments