Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ వన్డే : భారత బౌలర్ల ధాటికి 157 పరుగలకే ఆలౌట్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (10:51 IST)
నేపియర్ వన్డేలో భారత బౌలర్లు జూలు విదిల్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ దెబ్బకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. కీవీస్ జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ కీలకమైన మూడు వికెట్లు, చాహాల్ 2, జాదవ్‌ ఒక వికెట్ చొప్పున తీశాడు. ఫలితంగా కివీస్ జట్టు 157 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టును ఆరంభంలోనే షమీ దెబ్బతీశాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (64) ఒక్కడే అర్థశతకంతో రాణించగా, రాస్ టేలర్ (24) పరుగులు చేశాడు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గుప్తిల్ (5), మున్రో (8), టామ్ లాథమ్ (11), హెన్రీ నికోల్స్ (12) నిరాశపరిచారు. 
 
పైగా, సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు కేవలం 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌట్ అయింది. నిజానికి 145 పరుగుల వద్ద 6 వికెట్లతో ఉన్న జట్టు మరో 12 పరుగులు జోడించేలోపే చివరి నాలుగు వికెట్లనూ కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

యునెస్కో రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం.. హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

కరువు ప్రాంతం నుంచి వచ్చా, 365 రోజులు ఇక్కడ వాన చినుకులు: రఘువీరా video పోస్ట్

జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

తర్వాతి కథనం
Show comments