Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో ధోనీ కూతురు ఫోటో: జివా చేతి వేళ్లు మాత్రమే...!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (13:54 IST)
కూల్ కెప్టెన్, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జివా ఫోటో ట్విట్టర్‌లోకి వచ్చేసింది. అయితే ధోనీ కూతురు ఫుల్ ఫోటో మాత్రం కనిపించదు. ఇది అభిమానులకు నిరాశ కలిగించే వార్తే. ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ సదరు ఫొటోను ట్విట్టర్‌లో పెట్టిందట. అయితే సదరు ఫొటోలో జివా చేతి వేళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తన వేలిని పట్టుకున్న జివా చేతిని సాక్షి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
గత నెల 6న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జివా జన్మించిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆస్ట్రేలియా వెళ్లిన ధోనీ, కూతురుని చూసేందుకు రాలేదు. కూతురు కంటే వరల్డ్ కప్ టోర్నీకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించిన ధోనీ, మెగా టోర్నీ ముగిసిన తర్వాత కాని భారత్ రానని పేర్కొన్నాడు. కాగా టీమిండియా వరల్డ్ కప్‌లో ధీటుగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ధోనీ సేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments