ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : సిడ్నీ చేరుకున్న ధోనీ - రోహిత్

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (15:20 IST)
ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యంగా, టెస్ట్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో పలువురు సీనియర్ క్రికెటర్లకు చోటుకల్పించారు.
 
ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. తొలి వన్డేకు వేదికైన సిడ్నీ నగరానికి వారు చేరుకున్నారు. వీరివెంట యువ బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా ఉన్నారు. రోహిత్, ధోనీతో కలిసి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరామని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే శనివారం ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పీడ్‌స్టర్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. మరోవైపు భారత సారథి విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments