Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌లో ఫోర్లు - సిక్స్‌లే కాదు.. ఎయిట్స్ కూడా ఉండాలని.. ధోనీ నయా ఐడియా

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బ

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (13:52 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బంతి స్టేడియం బయట పడితే ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందనే సరికొత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
 
ప్రస్తుతం జరుతున్న ఐపీఎల్ పదకొండో సీజన్ పోటీల్లో భాగంగా, మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత పసులు జెర్సీ వేసుకుని సీఎస్కే జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. 
 
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్స్‌లు నమోదు కాగా, కొన్ని బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి కూడా. ఇక ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన ధోనీ బంతి బయట పడితే ఆరు పరుగులకు బదులుగా ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఇపుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments