టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన ఈ దశాబ్ధపు ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ జట్టుకు ధోనీ సారథిగా ఎంపికయ్యాడు. ధోనీతో పాటు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లనూ చేర్చింది. ఈ జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ మాత్రమే వుండడం గమనార్హం.
ఇక సీఏ ప్రకటించిన ఈ దశాబ్ధపు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, బంగ్లాదేశ్కు చెందిన షకీబుల్ హసన్, ఇంగ్లండ్కు చెందిన జోస్ బట్లర్, శ్రీలంక నుంచి లసిత్ మలింగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్, న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్కు చోటు దక్కింది. ఇక సీఏ టెస్టు జట్టుకు మాత్రం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరునే ప్రకటించడం విశేషం.