Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ తర్వాత ధోనీనే.. 504 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి సరసన..

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:17 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా సూపర్ 4లో మంగళవారం ఆప్ఘన్‌తో జరిగే వన్డే మ్యాచ్.. ధోనీ కెరీర్‌లో 504వది కావడం విశేషం. 
 
తద్వారా సచిన్ తర్వాత ధోనీ నిలిచాడు. ఇక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ (504) మ్యాచులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ ఇవాల్టి మ్యాచ్ ద్వారా సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 
 
ఇకపోతే ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. కాగా ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments