Webdunia - Bharat's app for daily news and videos

Install App

హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలున్నారని తెలిసి షాకయ్యా: మహ్మద్ షమీ

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ తన భార్య హసీన్‌కు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. తనను వివాహం చేసుకునేందుకు ముందే హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దర

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (18:12 IST)
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అతని భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా షమీ తన భార్య హసీన్‌కు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. తనను వివాహం చేసుకునేందుకు ముందే హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలు వున్నారనే విషయం తనకు తెలియదన్నాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకుందని.. పిల్లలు ఎవరని అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలంటూ అబద్ధాలు చెప్పిందని షమీ అన్నాడు. హసీన్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి.. పెళ్లి చేసుకున్నట్లు షమీ తెలిపాడు. 
 
పెళ్లైన కొంతకాలానికే అసలు విషయం చెప్పిందని.. ఆమెకు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలున్నారనే విషయం తెలుసుకుని షాక్ తిన్నానని షమీ చెప్పుకొచ్చాడు. కాగా 2002లో హసీన్ జహాన్‌కు ఫషీయుద్ధీన్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం వున్నారు. ఫషీయుద్ధీన్‌తో విభేదాలు తలెత్తడంతో 2010లో అతనికి దూరమైన హసీన్.. 2012తో షమీని పరిచయం చేసుకుని.. 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ పాప వుంది. కాగా షపీయుద్ధీన్-హసీన్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. 
 
వీరిలో పెద్ద పాప ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతోంది. హసీన్-షమీ వివాహానంతరం షపీయుద్ధీన్ వద్దకే వారిద్దరూ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో షమీ తన కుమార్తెలను ప్రేమగా చూసుకునేవాడని షపీయుద్ధీన్ తెలిపాడు. ఈ ప్రేమతోనే తన పెద్ద కూతురు వారిద్దరూ కలిసి జీవించాలని.. విడిపోకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు షఫీయుద్ధీన్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments