Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ వన్డే : సెంచరీ కొట్టిన బౌలర్ మహ్మద్ షమీ

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (10:00 IST)
భారత క్రికెట్ జట్టులోని పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బౌలింగ్‌లో సత్తాచాటి.. ఏకంగా వంద వికెట్లను తీశాడు. ఇలా వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తన పేరును కూడా లిఖించుకున్నాడు. 
 
భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య 23వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమైన వన్డే సిరీస్‌లో భాగంగా, నేపియర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే షమీ.. అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్ ఓపెనర్లు గుప్తిల్ (5), మున్రో (8)లను పెవిలియన్‌కు పంపాడు. 
 
తద్వారా తన ఖాతాలో వంద వికెట్లను వేసుకున్నాడు. పైగా, అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా వంద వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. షమీ కేవలం 56 వన్డే మ్యాచ్‌లలోనే ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. 
 
షమీ కంటే ముందు ఈ ఘనతను సాధించిన భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 59 మ్యాచ్‌లలో వంద వికెట్లు తీయగా, జహీర్ ఖాన్ 65 మ్యాచ్‌లలో, అజిత్ అగార్కర్ 67 మ్యాచ్‌లలో, జవగల్ శ్రీనాథ్ 68 మ్యాచ్‌లలో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments