భారత జట్టు ఆటతీరును ఏకిపారేసిన మైఖేల్ వాన్.. అత్యంత చెత్త జట్టు అంటూ..

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (12:16 IST)
భారత్ క్రికెట్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారధి మైఖేల్ వాన్ ఏకిపారేశాడు. వన్డే జట్లలోనే అత్యంత చెత్త టీం భారత్ అంటూ దారుణంగా విమర్శించారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వారు ఏం సాధించారంటూ ఆయన ప్రశ్నించారు. పైగా, ప్రపంచ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్‌లో ఆడి చూపిస్తున్నా.. తమ ఆటతీరును, ప్రదర్శనను ఏమాత్రం మెరుగుపరుచుకోలేక పోతున్నాంటూ ఘాటైన విమర్శలు చేశారు. అయితే, మైఖేల్ వాన్ చేసిన విమర్శలు ప్రతి ఒక్క భారతీయ సగటు క్రికెట్ అభిమానిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. 
 
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అత్యంత చెత్త ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై మైఖేల్ వాన్ స్పందించారు.
 
"50 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఏం సాధించింది. ఏమీ లేదు. భారత్ ఆడే వైట్ బాల్ గేమ్ (వన్డే) పాతకాలం నాటిది. వన్డే చరిత్రలో అత్యంత చెత్త పనితీరు కలిగిన జట్టు. ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఐపీఎల్‌కు వెళ్లి ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో చూపిస్తున్నారు. కానీ, భారత్ ఇప్పటివరకు ఏం సాధించింది? అంటూ ప్రశ్నిస్తూ, టీమిండియా వైఫల్యంపై పోస్ట్ మార్టమ్ నిర్వహించినంతపని చేశాడు. 
 
అదేసమయంలో భారత జట్టులో ప్రతిభకు, నైపుణ్యానికి ఏమాత్రం కొదవలేదు. సరైన విధానమే లోపించింది. ఎవరూ కూడా భారత్‌ను విమర్శించాలని అనుకోరు. ఎందుకంటే సోషల్ మీడియాలో వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్లేషకులు, క్రికెట్ పండితులు అయితే, నోరు మెదవు. ఎందుకంటే బీసీసీఐతో కలిసి పనిచేసే అవకాశం కోల్పోతామన్న భయం. ఈ కారణంగానే వారు నోరు విప్పేందుకు భయపడతారు. వారి బౌలింగ్ ఆప్షన్లు కొన్నే. బ్యాటింగ్ లైన్ కూడా లోతుగా ఉండదు. స్పిన్ ట్రిక్స్ కూడా లోపించాయి" అని గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments