Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్ట్ : రహానే అద్భుత సెంచరీ - భారత్ 276*/5

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (12:27 IST)
భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఫలితంగా టీమిండియా 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 
 
నిజానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 195 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఏ దశలోనూ కోలుకోలేకుండా పోయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్... ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
 
ఇందులో మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 195 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు. 
 
అంతకుముందు హనుమాన్ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఓటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 104, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. లైయాన్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 276/5గా ఉంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments