Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ.. అదరగొట్టిన మనోజ్ తివారీ.. నాటౌట్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:51 IST)
రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ తన బ్యాటుకు పనిచెప్పి విజృంభించాడు. త్రిశతకంతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. పశ్చిమ బెంగాల్-హైదరాబాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 414 బంతులు ఎదుర్కొన్న తివారీ 303 పరుగులు చేయడమేకాక నాటౌట్‌గా నిలిచాడు. తివారీ ఇన్నింగ్స్ లో 30 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. 
 
పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ క్రికెట్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు సోమవారం కూడా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లకు 635 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి దిగిన తివారీ ఆదివారం మ్యాచ్‌లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 
 
రెండో రోజైన సోమవారం ఆటలో రెండు సెంచరీలతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. కాగా మనోజ్ తివారీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడీ టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments