Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోధా కమిటీ వర్సెస్ బీసీసీఐ: అకౌంట్లను స్తంభింపచేయడం దురదృష్టకరమన్న అనురాగ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అకౌంట్లను స్తంభింప చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీసీసీఐ అకౌంట్లను స్తంభింప చేయలేదని లోధా కమిటీ అంటుంటే, తమ అకౌంట్లను లోధా కమిటీ నిలిపివ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (18:55 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అకౌంట్లను స్తంభింప చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీసీసీఐ అకౌంట్లను స్తంభింప చేయలేదని లోధా కమిటీ అంటుంటే, తమ అకౌంట్లను లోధా కమిటీ నిలిపివేసిందని బీసీసీఐ స్పష్టం చేసింది.

బీసీసీఐ అకౌంట్లను నిలిపివేయటం చాలా దురదృష్టకరమంటూ ఠాకూర్ పేర్కొన్నారు. తమ మొత్తం అకౌంట్లు లోధా ప్యానెల్ ఆదేశాలతో స్తంభింపబడ్డాయన్నారు. దాంతో ప్రస్తుతం టోర్నమెంట్లు నిర్వహించడానికి నిధులు లేవని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 
 
అయితే అంతకుముందు బీసీసీఐ అకౌంట్ల నిలుపుదలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని లోధా ప్యానెల్ పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై ఎలాంటి అభ్యంతరం లేదని సదరు కమిటీ పేర్కొంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు చాంపియన్స్ ట్రోఫీకి స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నా.. ఇది ముందస్తు షెడ్యూల్ కాబట్టి ఆ రెండు టోర్నీల్లో భారత జట్టు పాల్గొనవచ్చని తెలిపింది. ఇరువురి వాదనలు భిన్నంగా ఉండటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments