Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ టెస్ట్ : భారత్ 571 ఆలౌట్ - కోహ్లీ డబుల్ సెంచరీ మిస్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (17:45 IST)
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు చాలా ఓపిగ్గా ఆడారు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది. అయితే, కోహ్లీ మొత్తం 186 పరుగులు చేసి డబుల్ సెంచరీని చేజార్చుకుని 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత కోహ్లీ చేసిన 28వ వ్యక్తిగత సెంచరీ. ఈయన 2019లో చివరిసారి సెంచరీ చేశాడు. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేశాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకు చేసిన 27 సెంచరీల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని చేసిన రెండో సెంచరీ ఇదే. మొత్తం 241 పరుగులు ఫేస్‌ చేసి సెంచరీ చేశాడు. గత 2012-13లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 బంతులు ఎదుర్కొని కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది 28వ టెస్ట్ సెంచరీ కాగా, మొత్తంగా 75వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments