అహ్మదాబాద్ టెస్ట్ : భారత్ 571 ఆలౌట్ - కోహ్లీ డబుల్ సెంచరీ మిస్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (17:45 IST)
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు చాలా ఓపిగ్గా ఆడారు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది. అయితే, కోహ్లీ మొత్తం 186 పరుగులు చేసి డబుల్ సెంచరీని చేజార్చుకుని 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత కోహ్లీ చేసిన 28వ వ్యక్తిగత సెంచరీ. ఈయన 2019లో చివరిసారి సెంచరీ చేశాడు. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేశాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకు చేసిన 27 సెంచరీల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని చేసిన రెండో సెంచరీ ఇదే. మొత్తం 241 పరుగులు ఫేస్‌ చేసి సెంచరీ చేశాడు. గత 2012-13లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 బంతులు ఎదుర్కొని కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది 28వ టెస్ట్ సెంచరీ కాగా, మొత్తంగా 75వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments