Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని ఆడించేందుకు దాదాను పది రోజులు బతిమాలితే..?: కిరణ్ మోరె

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:15 IST)
2003-04 దిలీప్ ట్రోఫీ ఫైనల్‌లో దీప్‌దాస్ గుప్తా బదులు ఎమ్మెస్ ధోనీని ఆడించడానికి తాము ఎంత ప్రయాసపడ్డామో, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఒప్పించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో చెప్పుకొచ్చాడు మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరె.

ఆ సమయంలో నిజానికి ఇండియన్ నేషనల్ టీమ్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్ లేడు. లెజెండరీ ప్లేయర్ రాహుల్ ద్రవిడే ఆ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. టీమ్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతడు విజయవంతమయ్యాడు. 
 
2003 వరల్డ్‌కప్‌లోనూ ఆడాడు. అయితే ఎక్కువ కాలం ఇలా కొనసాగకూడదని, ఇండియన్ టీమ్‌కు ఓ రెగ్యులర్ వికెట్ కీపర్ కావాల్సిందనని సెలక్టర్లు భావించారు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న ధోనీ గురించి చీఫ్ సెలక్టర్ కిరణ్ మోరె తెలుసుకున్నాడు. 
 
దీనికోసం అప్పటి కెప్టెన్ గంగూలీ వెంట పడ్డాడు. దాదాకు మాత్రం తుది జట్టులో తన కోల్‌కతాకే చెందిన దీప్‌దాస్ గుప్తాను ఆడించాలని ఉంది. దీంతో గంగూలీని ఒప్పించడానికి తాము చాలా ప్రయాస పడాల్సి వచ్చిందని కిరణ్ మోరె చెప్పాడు. ఏకంగా 10 రోజుల పాటు దాదాను బతిమాలితే మొత్తానికి అతడు అంగీకరించాడు అని మోరె తెలిపాడు. ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన ధోనీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments