Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్‌ దేవ్‌ను సతీసమేతంగా కలిసిన అల్లు అర్జున్!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (11:18 IST)
ఫాస్ట్ బౌలింగ్‌తో ఉరకలు పెట్టించిన లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను అల్లు అర్జున్ దంపతులు కలిశారు. కపిల్ సారథ్యంలోనే టీమిండియా తన తొలి వరల్డ్ కప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ కపిల్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిశాడు. ఈ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డిని కూడ తీసుకెళ్లాడు. 
 
ఈ ఫోటోలను అల్లు అర్జున్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. "మన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలిశాం. ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. చాలా సింపుల్‌గా ఉన్నారు. సెట్ మ్యాక్స్‌లో హిందీలోకి డబ్ అయిన సౌత్ ఇండియా సినిమాలను చూస్తానని కపిల్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పారు. రేసు గుర్రంలో తన నటన గురించి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకెంతో గర్వంగా ఉంది" అంటూ పోస్ట్ చేశాడు. రేసు గుర్రం సినిమాపై కపిల్ దేవ్ ప్రశంసలు గుప్పించారు. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే 20 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2016 సమ్మర్‌కు రిలీజ్ కానుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments