Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకున్న హర్యానా హరికేన్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:38 IST)
ఇటీవల ఛాతినొప్పికి గురైన హర్యానా హరికేన్, భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తిరిగి కోలుకున్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ చేశారు. 
 
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి, దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించిన క్రికెట్ హీరో అయిన కపిల్ దేవ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కపిల్ కోలుకున్నారని, డిశ్చార్జ్ అయ్యారని మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
 
కాగా, ఇటీవల ఆసుపత్రిలో కపిల్‌ తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను కూడా ఆయనే పోస్టు చేసిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ అయినట్లు చేతన్‌ శర్మ తెలుపుతూ ఆయనకు యాంజియో ప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్‌ అతుల్‌ మథుర్‌తో కలిసి దిగిన ఫొటోను చేతన్‌ ఆదివారం పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments