గోపీచంద్ కారణంగానే నా కెరీర్ నాశనమైంది : గుత్తా జ్వాలా

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:09 IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మరోమారు వార్తలకెక్కారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. తన కెరీర్‌ను గోపీచంద్ నాశనం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
ఆమె సోమవారం ఓ మీడియాతో మాట్లాడుతూ, 'నా కెరీర్‌లో ఎదుర్కొన్న వేధింపులకు గోపీచందే కారణంగా చెబుతాను. నేనేదైనా బహిరంగంగానే మాట్లాడతా. దీనికి తగిన మూల్యం కూడా చెల్లించా. బ్యాడ్మింటన్‌లో నా సత్తా ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే నాకు మద్దతుగా ఉంటాడని భావించా. కానీ మిక్స్‌డ్‌లో నాతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు. 
 
ఒకప్పుడు టాప్‌ ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. కానీ గత దశాబ్దకాలంగా అంతా హైదరాబాద్‌లోని అతడి అకాడమీ నుంచి మాత్రమే వస్తున్నారు. అలా అయితేనే వారికి గుర్తింపు లభిస్తుంది. భారత్‌కు పతకం వస్తే అది గోపీచంద్‌ శిక్షణ వల్లే వచ్చినట్టు, రాకపోతే మాత్రం తప్పు వ్యవస్థ మీదికి నెట్టేస్తున్నారు' అన గుత్తా జ్వాలా ఆరోపణలు చేసింది. 
 
కాగా, 2004లో గుత్తాజ్వాల, గోపీచంద్ ఇద్దరూ కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments