Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో వన్డే సిరీస్‌.. ఫిటినెస్ లేమితో బుమ్రా అవుట్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:40 IST)
భారత పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ లేమి కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టు (బీసీసీఐ) గతంలో బుమ్రాను రీకాల్‌ చేసింది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో భారత్ తరఫున ఆడాడు. 
 
అప్పటి నుంచి, అతను ఆసియా కప్, T20 ప్రపంచ కప్‌తో సహా దేశం కోసం చాలా పెద్ద ఈవెంట్‌లలో ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్ కోసం బుమ్రా తిరిగి భారత జట్టులోకి వస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే పేసర్ పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.
 
శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు ముందు గౌహతిలో జట్టులో చేరేందుకు సిద్ధమైన బుమ్రా బౌలింగ్‌లో పుంజుకోవడానికి మరికొంత సమయం కావాలి. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments