జస్ప్రీత్ బుమ్రాకు తగినంత సమయమివ్వాలి : హార్దిక్ పాండ్యా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:56 IST)
భారత ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బూమ్రాకు తగినంత సమయం ఇవ్వాలని, అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయరాదని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గాయం నుంచి తిరిగి కోలుకున్న బుమ్రాకు తగిన సమయంతో పాటు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. 
 
దీనిపై పాండ్యా స్పందిస్తూ, 'బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బౌలింగ్‌పై కాస్త ఆందోళన ఉండొచ్చు. కానీ మేం మా కుర్రాళ్లను నమ్మాలి. ఈ 15 మంది దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. అందుకే జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం లోటే. అతడు చాలా ప్రభావం చూపిస్తాడు. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన అతడికి పునరాగమనానికి తగినంత సమయం ఇవ్వాలి. అతడిపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు' అని హార్దిక్ పాండ్యా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments