Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ప్రీత్ బుమ్రాకు తగినంత సమయమివ్వాలి : హార్దిక్ పాండ్యా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:56 IST)
భారత ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బూమ్రాకు తగినంత సమయం ఇవ్వాలని, అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయరాదని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గాయం నుంచి తిరిగి కోలుకున్న బుమ్రాకు తగిన సమయంతో పాటు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా, మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు. 
 
దీనిపై పాండ్యా స్పందిస్తూ, 'బుమ్రా జట్టుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బౌలింగ్‌పై కాస్త ఆందోళన ఉండొచ్చు. కానీ మేం మా కుర్రాళ్లను నమ్మాలి. ఈ 15 మంది దేశంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. అందుకే జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బుమ్రా లేకపోవడం లోటే. అతడు చాలా ప్రభావం చూపిస్తాడు. అయితే గాయం నుంచి కోలుకుని వచ్చిన అతడికి పునరాగమనానికి తగినంత సమయం ఇవ్వాలి. అతడిపై మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు' అని హార్దిక్ పాండ్యా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments