Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్.. దోషులంతా నిర్దోషులే.. ఢిల్లీ హైకోర్టు తీర్పు :: ఏడ్చేసిన శ్రీశాంత్

Webdunia
శనివారం, 25 జులై 2015 (17:16 IST)
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు శనివారం సంచలన తీర్పును వెలువరించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషులుగా ప్రకటించిన వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు దోషులుగా నిలబెట్టిన 16 మంది క్రికెటర్లను నిర్ధోషులుగా విముక్తులయ్యారు. 
 
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరోపణలను రుజువు చేయలేకపోయారని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడినప్పటి నుంచి నిషేధం వేటు ఎదుర్కొంటున్న 16 మంది క్రికెటర్లు హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీ పోలీసుల ఆరోపణలతో 16 మంది క్రికెటర్ల కెరీర్ ప్రమాదంలో పడింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 
 
మరోవైపు తుది తీర్పు కోసం కోర్టుకు వచ్చిన ఆ 16 మంది క్రికెటర్లలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా కూడా ఉన్నారు. వీరు కోర్టు తీర్పు అనంతరం కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చిందంటూ హర్షం వ్యక్తంచేశారు. కళంకిత ముద్ర పోగొట్టుకున్నామని చెప్పారు. ఆరోపణలతో అరెస్టైన రోజే శ్రీశాంత్ మాట్లాడుతూ, తాను నిర్థోషినని, కేసులోంచి కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని పేర్కొన్న సంగతితెలిసిందే. అతని నమ్మకం కోర్టు తీర్పుతో రుజువైంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments