Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (12:16 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ పోటీలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్, ముగింపు మ్యాచ్‌లకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్ సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ సొంత వేదికలో టోర్నీ తొలి, ఆఖరి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. క్వాలిఫయర్ 2కు కూడా ఈడెన్ ఆతిథ్యమివ్వనుంది.
 
ఇక ప్లేఆఫ్స్ తొలి రెండు మ్యాచ్‌ల క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలవుతుందని భావిస్తున్నారు. గత యేడాదిలాగే 2025 ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉంటాయి. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ నాలుగు వేదికలను ఖరారు చేసింది. ముంబై, బెంగళూరు, బరోడా, లక్నోలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 
 
వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుంది. 'ఇక నుంచి ఐపీఎల్లో ఐసీసీ ప్రవర్తన నియమావళిని అమలు చేస్తాం. ఇప్పటివరకు ఐపీఎల్ తన సొంత ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకుంది' అని ఓ ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు చెప్పాడు. 
 
గత ఏడాది ఐపీఎల్లో కోల్కతాను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి పంజాబ్ కింగ్‌కు సారథ్యం వహించనున్నాడు. కేకేఆర్‌ను వీడి వేలంలోకి వెళ్లిన శ్రేయస్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పుడే అతను పంజాబ్ కెప్టెన్ కాబోతున్నాడని అర్థమైంది. ఇప్పుడీ విషయాన్ని పంజాబ్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments