Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు దూరమైన మహ్మద్ షమీ - గుజరాత్ టైటాన్స్‌కు కొత్త పేసర్

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (12:32 IST)
ఈ నెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుంది. అయితే, భారత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. ఆయన చీలమండకు సర్జరీ చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో షమీ ప్రాతినిథ్యం వహించే గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం షమీ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకుంది. సందీప్ వారియర్ అనే పేసర్‌ జీటీలో చేశారు. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి కూడా అధికారికంగా ప్రకటించారు. మహ్మద్ షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అతడి స్థానంలో తీసుకున్న సందీప్ ఇప్పటివరకు 5 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడని వెల్లడించింది. సందీప్‌ను బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి గుజరాత్ దక్కించుకున్నట్టు వివరించింది. 
 
మరోవైపు గాయం కారణంగా 2024 ఎడిషన్ నుంచి మధుశంక వైదొలగడంతో అతడి స్థానంలో అండర్-19 వరల్డ్ కప్లో మెరిసిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వేనా మఫాకాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుందని ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లలో ఆడాడు. 
 
మధుశంక ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు దూరమయ్యాడని ఐపీఎల్ పాలకమండలి నిర్ధారించింది. దిల్షాన్ మధుశంక గాయం కారణంగా తొలగాడని తెలిపింది. అతడి స్థానంలో తీసుకున్న క్వేనా మఫాకా దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడని, ఎడమచేతి వాటం పేసర్ అని తెలిపింది. 
 
ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఎంపికయ్యాడని పేర్కొంది. బేస్ ధర రూ.50 లక్షల మొత్తానికి ముంబై ఇండియన్స్ అతడిని జట్టులో చేర్చుకుందని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments