Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే... ఐపీఎల్ టైటిల్ ఎవరికి?

Webdunia
సోమవారం, 29 మే 2023 (11:06 IST)
ఐపీఎల్ 2023 ఫైనల్ పోటీకి వరుణుడు అడ్డుపడ్డాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి జరగాల్సివుంది. కానీ, భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఫైనల్ పోరు రిజర్వు డేకు మారింది. అహ్మదాబాద్‌లో సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఐపీఎల్ 2023 టైటిల్ మాత్రం గుజరాత్ టైటాన్స్‌కే వరించనుంది. పాయింట్ల పట్టిక ఆధారంగా గుజరాత్ ఈ సీజన్ విజేతగా ప్రకటించనున్నారు. 
 
రిజర్వు డే నాడు కూడా వర్షం కురిసి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడినపక్షంలో ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ మొదలవలవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే...
 
రాత్రి 9.45 గంటలకు లోపు మ్యాచ్ మొదలైతే 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. అప్పటికీ మ్యాచ్ ప్రారంభించే పరిస్థితి లేకుంటే రాత్రి 11.56 గంటలకు 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. అప్పటికీ వర్షం ఆగకపోతే రాత్రి ఒంటి గంట వరకు వేచి చూస్తారు. 
 
రాత్రి 1.20 గంటలకు వాతావరణం అనుకూలిస్తే సూపర్ ఓవర్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. అదీకూడా సాధ్యంకాని పక్షంలో పాయింట్ల పట్టిక ఆధారంగా గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments