Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటవరణ పరీక్షణలో బీసీసీఐ - ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు

Webdunia
బుధవారం, 31 మే 2023 (16:52 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ఇందుకోసం ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌లో ఒక్కో డాట్​ బాల్​కు 500 చెట్లు నాటుతామని ప్రకటించింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌తో ఐపీఎల్-16 సీజన్‌ ముగిసింది. మరి ప్లేఆఫ్స్​లో ఎన్ని డాట్​ బాల్స్​ నమోదయ్యాయి?, ఎన్ని మొక్కలను నాటబోతున్నారో తెలుసుకుందాం. 
 
చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 84 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి 96 డాట్ బాల్స్‌ వేశారు. గుజరాత్, ముంబై మధ్య జరిగిన క్వాలిఫయర్-2లో 67 డాట్ బాల్స్‌ వేయగా..  చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 45 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయి. 
 
ఈ లెక్కన ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 292 డాట్‌ బాల్స్‌ నమోదయ్యాయన్నమాట. అంటే 292×500 లెక్కన  బీసీసీఐ మొత్తం 1,46,000 మొక్కలు నాటనుంది. ఈ డాట్‌ బాల్స్‌లో సింహభాగం ఆకాశ్‌ మధ్వాల్, మహ్మద్‌ షమి, రషీద్‌ఖాన్‌, మతీశా పతిరనలదే కావడం గమనార్హం. 
 
భారత క్రికెట్ బోర్డు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలానే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments