ఐపీఎల్ 2023 : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (20:36 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పోటీల్లో భాగంగా, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేదికలను ఖరారు చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లలో నాలుగు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 
 
మే 23వ తేదీన క్వాలిఫయర్‌-1, 24వ తేదీన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. మే 26వ తేదీన క్వాలిఫయర్‌-2, 28వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
క్వాలిఫయర్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య మే 23వ తేదీన చెన్నైలో జరుగుతుంది. మ్యాచ్ 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టీమ్ 3, టీమ్ 4 జట్ల మధ్య చెన్నైలో నిర్వహిస్తారు. 
 
మే 26వ తేదీన క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ ఒకటి ఓటమిపాలైన జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ క్వాలిఫయర్ ఒకటి విజేత, క్వాలిఫయర్ 2 విజేత జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments