Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్‌ను మైదానంలోకి విసిరిన అవేష్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (10:57 IST)
Avesh Khan
ఐపీఎల్ సిరీస్‌లో లక్నో జట్టు ఆటగాడు అవేశ్ ఖాన్ చేసిన చర్యకు ఐపీఎల్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్ ఇచ్చింది. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 212 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
విరాట్ కోహ్లీ (61), బాబ్ డు ప్లసీ (79), మ్యాక్స్‌వెల్ (59) పరుగులు చేశారు. కానీ లక్నో జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు, ఆర్సీబీ పేలవమైన బౌలింగ్ కారణంగా ఎక్కువ పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణించడంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 213 పరుగులు చేసింది. 
 
మ్యాచ్ ముగిసే సమయానికి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అవేశ్ ఖాన్ ఒక్క బంతినే ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. అయితే, మ్యాచ్ గెలిచిన తర్వాత, ఉద్వేగానికి గురైన అవేష్ ఖాన్ తన హెల్మెట్‌ను మైదానంలోకి విసిరాడు. ఆయన అలా చేయడం వివాదాస్పదమైంది. క్రికెట్ పరికరాలను ట్యాంపరింగ్ చేసినందుకు అవేశ్ ఖాన్‌ను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.2 కింద మందలించింది.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments