Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి చేదు అనుభవం.. రూ. 12 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (16:10 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2020)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు.. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమిని ముటగట్టుకుంది. అదే కాదు ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లికి భారీ జరిమానా పడింది.
 
బౌలింగ్ పూర్తి చేయడానికి కేటాయించిన టైమ్‌ కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఐపీఎల్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి జరిమానా విధించినట్టు తెలిపింది. ఇక, ఈ మ్యాచ్ అన్నిరకాలుగా కోహ్లీకి చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పాలి.
 
పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కోహ్లి రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. ఆ సమయంలో రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ 83 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకసారి.. 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి కోహ్లి క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. దీనికి బెంగళూరు జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించడంతో పంజాబ్.. 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

తర్వాతి కథనం
Show comments