Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి చేదు అనుభవం.. రూ. 12 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (16:10 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2020)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు.. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమిని ముటగట్టుకుంది. అదే కాదు ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లికి భారీ జరిమానా పడింది.
 
బౌలింగ్ పూర్తి చేయడానికి కేటాయించిన టైమ్‌ కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఐపీఎల్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి జరిమానా విధించినట్టు తెలిపింది. ఇక, ఈ మ్యాచ్ అన్నిరకాలుగా కోహ్లీకి చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పాలి.
 
పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కోహ్లి రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. ఆ సమయంలో రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ 83 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒకసారి.. 89 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి కోహ్లి క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. దీనికి బెంగళూరు జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్ 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించడంతో పంజాబ్.. 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments