ఐపీఎల్ 2020లో భాగంగా పంజాబ్కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెరవకుండా.. స్టోక్స్, శాంసన్ వీరబాదుడు బాదడంతో.. స్మిత్ సేన సునాయాస విజయాన్నందుకుంది. డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న పంజాబ్ ఓటమి వైపు నిలిస్తే.. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
పంజాబ్ వరుస విజయాల జైత్రయాత్రకు రాజస్థాన్ బ్రేక్ వేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్లకు 185 పరుగులు చేసింది.