Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-11: హమ్మయ్య.. కోహ్లీసేన ఢిల్లీపై గెలిచింది.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌న

Webdunia
ఆదివారం, 13 మే 2018 (11:25 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌ను రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి.. ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌ చెలరేగడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ఆటగాళ్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 40 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. ఏబీ డివిలియర్స్‌ 37 బంతుల్లో 4  ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. 
 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆటగాళ్లలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, జాసన్‌ రాయ్‌లను వెంటవెంటనే చాహల్‌ వెనక్కి పంపాడు. అయినప్పటికీ ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ చెలరేగడంతో స్కోరువేగం పెరిగింది. 
 
శ్రేయర్‌ అయ్యర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌‌మెన్‌ అభిషేక్‌ శర్మ తన మొదటి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 21 పరుగులు చేసిన విజయ్‌శంకర్‌తో కలిసి.. ఢిల్లీకి భారీస్కోరును అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలలో 181 పరుగులు సాధించింది. అయితే ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి డూ ఆర్‌ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

తర్వాతి కథనం
Show comments