Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ ఔట్‌... మ్యాచ్‌లను తరలించాల్సిందే : హైకోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2016 (11:06 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బాంబే హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఈనెల 30వ తేదీ తర్వాత నిర్వహించే అన్ని ఐపీఎల్ మ్యాచ్‌‍లను మహారాష్ట్ర నుంచి తరలించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణను మహారాష్ట్ర నుంచి తరలించనున్నారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. అందువల్ల మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతించేది లేదని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. అర్థంతరంగా ఇప్పుడు మ్యాచ్‌లను తరలించడమంటే పెను సవాల్‌తో కూడుకున్నదని బీసీసీఐ విన్నవించినా కోర్టు అంగీకరించలేదు. 
 
మ్యాచ్‌లకు అనుమతిస్తే తాము రోజుకూ 40 లక్షలకు పైగా లీటర్ల నీటిని లాతూర్ సహా ఇతర ప్రాంతాలకు తాము సరఫరా చేస్తామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. దీంతోపాటు కరువు సహాయనిధి కింద ముంబై, పుణె ఫ్రాంచైజీలు చెరో రూ.5 కోట్లను రాష్ట్రానికి అందజేస్తాయని కూడా కోర్టుకు వివరించింది. 
 
అయినా, కూడా కోర్టు మాత్రం మ్యాచ్‌ల నిర్వహణకు అంగీకరించలేదు. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ వేరేచోటకు తరలించాలని జస్టిస్ వీఎమ్ కనడె, జస్టిస్ ఎమ్‌ఎస్ కార్నిక్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఆదేశాలు జారీచేసింది. తాజా కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 30లోపు కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే మహారాష్ట్రలో నిర్వహించనున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments