Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత దేశం గురించి భారతీయులకు తెలుసు.. సచిన్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:56 IST)
రైతు ఉద్యమం నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. 
 
బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని పేర్కొన్నారు.
 
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇతర దేశాల వారు కూడా స్పందిస్తున్నారు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్ స్పందించడంతో, రైతులకు ప్రపంచం వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో స్పందించారు. 
 
భారత్‌లో రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రిహన్నా ''మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు?'' అని ప్రశ్నించారు. ముఖ్యంగా రిహాన్నా ట్వీట్‌కు సచిన్ కౌంటరిచ్చారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments