Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి ప్రపంచ కప్ టీమిండియాదే : ఏబీ డివిలియర్స్

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (12:04 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ భారత్ - ఇంగ్లండ్ జట్లు మధ్య గురువారం జరుగుతుంది.
 
ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, ఈ పొట్టి ప్రపంచ కప్ విజేత ఎవరవుతారన్న విషయంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే, సోషల్ మీడియాలోనూ రసవత్తర చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఓ జోస్యం చెప్పారు. గ్రూపు-ఏ నుంచి న్యూజిలాండ్, గ్రూపు బి నుంచి భారత్‌లు ఫైనల్‌కు చేరుకుంటాయి, పొట్టి ప్రపంచ కప్‌ విజేతగా టీమిండియా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
దీనికి కారణం... భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్ళ ప్రతిభ పరవళ్లు తొక్కుతుందని, జట్టులోని ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సూర్యకుమార్, విరాట్ కోహ్లీలు భీకర ఫామ్‌లో ఉన్నారని చెప్పారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడని, అతడు కూడా ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

తర్వాతి కథనం
Show comments