Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర తీరంలో దంచుకొట్టుడు... టీమిండియా పరుగుల వరద - విండీస్ చిత్తు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (11:22 IST)
విశాఖపట్టణం సాగర తీరంలో భారత ఆటగాళ్లు దంచుకొట్టారు. స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా బుధవారం విశాఖపట్టణంలో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓడిపోయిన కసితో టీమిండియా ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఫలితంగా విశాఖ వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసి వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 
 
అత్యంత కీలకమైన ఈ వన్డేలో భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఇందులో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు 159, లోకేశ్‌ రాహుల్‌ 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 చొప్పున పరుగులు చేయడంతో కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. 
 
అలాగే, మిడిలార్డర్‌లో యువ ద్వయం శ్రేయాస్‌ అయ్యర్‌ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53, రిషబ్ పంత్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 39 చొప్పున ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సాగర తీరంలో పరుగుల సునామీ వచ్చినైట్లెంది. 
 
అనంతరం లక్ష్యఛేదనలో హ్యాట్రిక్‌ హీరో కుల్దీప్‌ యాదవ్‌ (3/52), షమీ (3/39) ధాటికి విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. హోప్‌ (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి నిలకడ ప్రదర్శించగా.. పూరన్‌ (47 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టాడు. వీరిద్దరు మినహా మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం కటక్‌లో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments