Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ టెస్ట్ : ధీటుగా బదులిచ్చిన లంకేయులు... 356/9

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:26 IST)
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 356 ప‌రుగులు చేసింది. భార‌త్ కంటే ఇంకా 180 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 131/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక‌ను మ‌థ్యూస్ (111), చండీమాల్ (147-నాటౌట్) ఆదుకున్నారు. 
 
మ‌థ్యూస్ ఔటైన త‌ర్వాత లాస్ట్ సెష‌న్‌లో శ్రీలంక వికెట్లు వెంటవెంటనే లాస్ట్ 15 ఓవ‌ర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే బ్యాడ్ లైట్ కార‌ణంగా 5 ఓవ‌ర్లు ముందే మ్యాచ్‌ను ముగించ‌డంతో శ్రీలంక ఆలౌట్ నుంచి త‌ప్పించుకుంది. భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ష‌మీ, ఇశాంత్, జ‌డేజా తలా 2 వికెట్లు తీసుకున్నారు.  
 
అంతకుముందు, భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌‌ను 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, సొంతగడ్డపై ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ద్విశతకంతో చెలరేగిపోయాడు. ఏకంగా 234 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా ఇది కోహ్లీకి ఆరో డబుల్ సెంచరీ. దీంతో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments