Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యధిక టై మ్యాచ్‌లు నమోదు చేసిన రెండో జట్టుగా భారత్!!

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (12:48 IST)
భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇప్పటికే ముగిసిన టీ20 టోర్నీని క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం నుంచి వన్డే సిరీస్ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కొలంబో వేదికగా శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ కూడా సమంగా 231 పరుగులు చేసింది. 48వ ఓవరులో భారత విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో క్రీజులో ఉన్న అర్షదీప్ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 
 
ఫలితంగా వన్డే క్రికెట్లో భారత్ పేరిట ఓ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్లో అత్యధిక టై మ్యాచ్‌లను నమోదు చేసిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. శ్రీలంకతో జరిగిన తాజా వన్డేతో కలుపుకొని ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్ 10 టైగా ముగిశాయి. మొత్తం 11 టై మ్యాచ్‌లతో వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానానికి చేరింది. ఈ క్రమంలో 9 చొప్పున టై మ్యాచ్‌లతో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను భారత్ అధిగమించింది. ఇక 8 టై మ్యాచ్‌లతో జింబాబ్వే ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments