Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా చిత్తు... తొలి ట్వంటీ20లో భారత్ విజయభేరీ

జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మెరుపు అర్థసెంచరీకి పేసర్‌ భువనేశ్వర్‌ (5/24) సూపర్‌ షో తోడవ్వడ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (09:44 IST)
జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మెరుపు అర్థసెంచరీకి పేసర్‌ భువనేశ్వర్‌ (5/24) సూపర్‌ షో తోడవ్వడంతో ఆదివారం వాండరర్స్‌ మైదానంలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 2014 ఏప్రిల్‌ తర్వాత సఫారీలపై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి. 
 
ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 203 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (27 బంతుల్లో 1 సిక్స్‌తో 29), కోహ్లీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) రాణించారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21) మెరుపు ఆరంభాన్నిచ్చాడు.
 
ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 పరుగులు 175 పరుగులు చేసి ఓడింది. హెన్‌డ్రిక్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 70), బెహర్డీన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ భువనేశ్వర్‌కు దక్కింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments