Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా చిత్తు... తొలి ట్వంటీ20లో భారత్ విజయభేరీ

జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మెరుపు అర్థసెంచరీకి పేసర్‌ భువనేశ్వర్‌ (5/24) సూపర్‌ షో తోడవ్వడ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (09:44 IST)
జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మెరుపు అర్థసెంచరీకి పేసర్‌ భువనేశ్వర్‌ (5/24) సూపర్‌ షో తోడవ్వడంతో ఆదివారం వాండరర్స్‌ మైదానంలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 2014 ఏప్రిల్‌ తర్వాత సఫారీలపై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి. 
 
ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 203 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (27 బంతుల్లో 1 సిక్స్‌తో 29), కోహ్లీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) రాణించారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21) మెరుపు ఆరంభాన్నిచ్చాడు.
 
ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 పరుగులు 175 పరుగులు చేసి ఓడింది. హెన్‌డ్రిక్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 70), బెహర్డీన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ భువనేశ్వర్‌కు దక్కింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments