Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వన్డేలో విజయం సాధించిన టీమిండియా: 2-2 తేడాతో సిరీస్ సమం

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2015 (22:25 IST)
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన నాలుగో వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మహాత్మ గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా వన్డే సిరీస్‌ను భారత్ సమం చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గురువారం జరిగిన నాలుగోవన్డేలో భారత జట్టు 35 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (138) సెంచరీతో రాణించగా అతనికి రైనా (53), రహానే (45) చక్కని సహకారమందించారు. 
 
అనంతరం 300 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు డికాక్ (43), డివిలియర్స్ (112) సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు మాత్రమే సాధించగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ రెండు, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత్ గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా వన్డే సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా ముంబైలో జరుగనున్న ఐదో వన్డే రసవత్తరంగా మారనుంది.
 
భారత్ చేతిలో ఓటమి సందర్భంగా దక్షిణాఫ్రికా వన్డే టీమ్ కెప్టెన్ డివిలియర్స్ మాట్లాడుతూ.. ముంబైలో జరిగే ఐదో వన్డేలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అంచనాల మేరకు తమ జట్టు రాణించలేదని.. అందుకే ఓటమి పాలయ్యామని డివిలియర్స్ తెలిపాడు. సిరీస్‌ను గెలుచుకునేందుకు తమకు మరో అవకాశం మిగిలి ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments