Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్ : కోహ్లీ పోరాటం.. భారత్ 223 ఆలౌట్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (21:31 IST)
ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో కేప్‌‍టౌన్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచితంగా ఒంటరిపోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. 
 
అయితే, మరోమారు ఔట్ సైడ్ ఎడ్జ్‌తో రబాడ  బౌలింగ్‌లో వెవిలియన్‌కు చేరాడు. అలాగే, మిగిలిన భారత ఆటగాళ్లలో పుజార్ 43, రిషబ్ పంత్ 27 మినహా ఇతరులెవ్వరూ రాణించలేదు. ఫలితంగా భారత్ 223 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు తీయగా, మాక్రో జాన్సన్ మూడు వికెట్లు తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనర్లు రాహుల్ 12, అగర్వాల్‌ 15 చొప్పున పరుగులు చేసి స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, కోహ్లీ జోడీ కాసేపు క్రీజ్‌లో నిలబడి సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ... రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత (Video)

సునీత విలియమ్స్ - బచ్ విల్మెర్ పరిస్థితేంటి : వీరు లేకుండానే కదిలిన ఆస్ట్రోనాట్ క్యాప్సుల్

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా సైలెంట్‌గా సైనెడ్‌తో చంపేసే లేడీ కిల్లర్స్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

తర్వాతి కథనం
Show comments