Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే!!

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (10:01 IST)
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సివుంది. అయితే, తొలి రోజు ఆట మొత్తం వర్షం కారణంగా రద్దు అయింది. ఈ క్రమంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. 
 
సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో రోజ్‌బౌల్ స్టేడియం నీటితో నిండిపోయింది. ఫస్ట్ సెషన్ కూడా సాగకపోవడంతో భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆశలు చిగురించాయి. అయితే, మైదానం మొత్తం నీటితో నిండిపోవడం, చినుకులు పడుతుండడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. 
 
శనివారం కనుక వర్షం నెమ్మదించి వాతావరణం అనుకూలిస్తే నేడు కోల్పోయిన సమయాన్ని రిజర్వు డే నాడు నిర్వహించే అవకాశం ఉంది. రేపు కూడా వరుణుడు ప్రభావం చూపితే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. వర్షం కారణంగా దురదృష్టవశాత్తు తొలి రోజు మ్యాచ్ రద్దు అయిందని, శనివారం మామూలుగానే నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments