Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే!!

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (10:01 IST)
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సివుంది. అయితే, తొలి రోజు ఆట మొత్తం వర్షం కారణంగా రద్దు అయింది. ఈ క్రమంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రోజు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. 
 
సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో రోజ్‌బౌల్ స్టేడియం నీటితో నిండిపోయింది. ఫస్ట్ సెషన్ కూడా సాగకపోవడంతో భోజన విరామం ప్రకటించారు. ఆ తర్వాత వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆశలు చిగురించాయి. అయితే, మైదానం మొత్తం నీటితో నిండిపోవడం, చినుకులు పడుతుండడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. 
 
శనివారం కనుక వర్షం నెమ్మదించి వాతావరణం అనుకూలిస్తే నేడు కోల్పోయిన సమయాన్ని రిజర్వు డే నాడు నిర్వహించే అవకాశం ఉంది. రేపు కూడా వరుణుడు ప్రభావం చూపితే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. వర్షం కారణంగా దురదృష్టవశాత్తు తొలి రోజు మ్యాచ్ రద్దు అయిందని, శనివారం మామూలుగానే నిర్ణీత సమయానికి మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

తర్వాతి కథనం
Show comments