Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో రెండో టెస్టు.. శిఖర్ ధావన్ అవుట్‌కు కారణం అదేనా..? పూజారా అర్థ సెంచరీ..

న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు చుక్కెదురైంది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ శి

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (14:18 IST)
న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు చుక్కెదురైంది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధవన్ వైఫల్యంపై ట్విట్టర్ లో సెటైర్ల వర్షం కురుస్తోంది.

కేఎల్ రాహుల్ గాయంతో జట్టులో స్థానం సంపాదించిన శిఖర్ తన బాధ్యతను మరచి పేలవంగా నిష్క్రమించాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో బంతిని బ్యాక్ ఫుట్‌లో ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసిన శిఖర్ సమయ పరిమితికి తాను ముగ్దుడ్ని అయ్యానంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ శిఖర్ పై జీవిత కథ తీస్తే ఈ విషయాన్ని కచ్చితంగా చూపించాలన్నాడు.

మరొక ట్వీట్‌లో పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ చేతికి వేసుకునే గ్లోవ్స్‌తో శిఖర్ ధవన్ గ్లోవ్స్ ను పోల్చుతూ ప్రశ్నలు సంధించారు. శిఖర్ తొందరగా అవుట్ కావడానికి కారణం ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడానికంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
 
కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్‌ కోహ్లీ, శిఖ‌ర్‌ ధావన్, విజయ్‌లు కనీసం రెండంకెల స్కోరయినా చేయలేకుండా వికెట్లు సమర్పించుకన్న వేళ క్రీజులోకి అడుగుపెట్టిన అజింక్యా ర‌హానే, చటేశ్వర పుజారా మైదానంలో నిల‌దొక్కుకున్నారు. నిలకడైన ఆటతీరును క‌న‌బ‌రుస్తున్నారు.  పూజారా 189 బంతుల్లో 13 ఫోర్లతో 64 పరుగులు సాధించగా, రహానే 47 పరుగులతో అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

న్యూజిలాండ్ బౌల‌ర్లు బౌల్ట్‌, హెన్రీ బౌలింగ్ విసిరిన బంతుల ధాటికి 46 పరుగులకే టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఒత్తిడిలో ఉన్న టీమిండియాను వారు గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం 64 పరుగుల‌తో పుజారా, 47 ప‌రుగుల‌తో ర‌హానే క్రీజులో ఉన్నారు. దీంతో టీ విరామానికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 136 పరుగులు సాధించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments