టీమిండియా, న్యూజిలాండ్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా కివీస్తో రెండో వన్డేలో భారత్ తలపడుతోంది. సిరీస్లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త్వరలో కీలకమైన టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు విరాట్ చెప్పాడు. షమీ స్థానంలో యువ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేయగా.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ చాహల్ను తుది జట్టులోకి తీసుకున్నారు.