Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో రెండో వన్డే.. 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (15:49 IST)
న్యూజిలాండ్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మౌంట్ మాంగనుయ్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 325 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా 40.2 ఓవర్లలోనే 234 పరుగులకు కివీస్ ఆలౌటైంది. 
 
భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తాచాటి.. నాలుగు వికెట్లతో కివీస్ వెన్నువిరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324పరుగులు సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్ 22 పరుగులు చేశారు. 
 
కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో  బ్రేస్ వెల్ మాత్రమే 57 పరుగులు చేసి భారత బౌలింగును ధీటుగా ఎదుర్కొన్నాడు.
 
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువనేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయంలో కీలకపాత్రను పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments